![]() |
![]() |

ఉగాది వచ్చిందంటే సంతోషాలు కూడా వెంటే వస్తాయి. ఇక బుల్లితెరకు పండగే పండగ అని చెప్పొచ్చు. ఈటీవీ ఈ ఉగాదికి "ఈసారి పండగ మనదే" పేరుతో రాబోతోంది. ఇక ఈ ఈవెంట్ కి స్పెషల్ సర్ప్రైజ్ కూడా తీసుకురాబోతోంది. ఎప్పుడో జబర్దస్త్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్లిపోయిన గాలోడిని మళ్ళీ వెనక్కి రప్పించింది. అదే సుడిగాలి సుధీర్. ఈ షో హోస్ట్ చేయబోతున్నాడు సుధీర్. అలాగే ఈ షోకి "ఫామిలీ స్టార్" మూవీ హీరో హీరోయిన్స్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ వచ్చారు. "తెలుగు ఇండస్ట్రీ బంగారు కొండా ..విజయ్ దేవరకొండా" అంటూ స్టేజి మీదకు ఇన్వైట్ చేసాడు సుధీర్.
తర్వాత దిల్ రాజు కూడా ఈ షోకి వచ్చారు. సింగర్ రామ్ మిరియాల అలాగే బుల్లితెర మీద ప్రతీ రోజూ కనిపిస్తూ ఎంటర్టైన్ చేసే బ్యాచ్ మొత్తం కూడా ఈ షోలో ఫుల్ మస్తీ చేస్తూ కనిపించారు. ఇక విజయ్ దేవరకొండ రావడంతోనే "వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్" అంటూ అందరినీ సరదాగా పలకరించాడు. అలాగా ఫామిలీ స్టార్ ప్రమోషన్స్ లో గోలగోల చేసిన లేడీ గ్యాంగ్ అంతా కూడా ఈ షోకి వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఇక ఒకే స్క్రీన్ మీద విజయ్ దేవరకొండని, సుడిగాలి సుధీర్ ని చూడడానికి ఆడియన్స్ ఐతే ఫుల్ వెయిట్ చేస్తున్నాం అంటూ ప్రోమో కింద కామెంట్స్ పెడుతున్నారు. "హైలీ ఇన్ఫ్లెమబుల్ కాంబినేషన్ ..ఈ ఎపిసోడ్ ని అస్సలు మిస్ చేయకుండా చూడాలి..తెలుగు రియల్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ..సుధీర్ అన్నా వెనక్కి వచ్చాడు ఇక పండగే మా అందరికీ..కొండ ఉన్నా చూడం, బండ ఉన్నా చూడం నిన్నే చూస్తాం" అంటూ క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్...
![]() |
![]() |